30.7 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఆపడం ఎవరి తరం కాదు: బీజేపీ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్న ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. ఈ కేసులో అవినాశ్ అరెస్ట్ కాకుండా ఆపడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుపడుతోందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు. సీబీఐ వ్యూహాత్మకంగానే అరెస్ట్ ఆలస్యం చేస్తోందన్నారు.

సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు స్థానిక పోలీసులు సహకరించపోవడం మంచి పద్ధతి కాదన్నారు. కోడికత్తి తరహాలోనే అవినాశ్ రెడ్డి ఆసుపత్రి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ఈ నాలుగేళ్లలో సీఎం జగన్‌ నయవంచక పాలన అందించారని విమర్శించారు. జగన్ రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు పొత్తులపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్ కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్