39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేయడంతో సీబీఐ దూకుడు పెంచే అవకాశముంది. దీంతో త్వరలోనే అవినాశ్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. కాగా వివేకా హత్య కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Latest Articles

టీడీపీ తుది జాబితా విడుదుల ….. చెలరేగిన అసమ్మతి

    ఏపీలో ఎన్నికల జాతర మహా రంజుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్