26.7 C
Hyderabad
Saturday, June 10, 2023

సీఎం జగన్ దృష్టికి అసెంబ్లీలో దాడి ఘటన

AP Politics: అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రిని కలిసి తమపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు, నారాయణ స్వామి, ఎలిజా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల స్పీకర్ పోడియంపైకి దూసుకెళ్లడం, ప్లకార్డులను ఆయన ముఖంపై పెట్టడం, చేయి వేయటం వంటి విషయాలను సీఎంకు కూలంకషంగా వివరించారు నేతలు.

ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరిగే సమయంలో తెలుగు దేశం పార్టీ సభ్యుల ఆందోళన చేపట్టారు. జీవో నంబర్‌ 1పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేస్తూ.. జీవో రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. పోడియం ముందులి చేరి నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికార వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో స్పీకర్ సీతారాం అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.

 for

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్