AP Politics: అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్న విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ముఖ్యమంత్రిని కలిసి తమపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు, నారాయణ స్వామి, ఎలిజా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల స్పీకర్ పోడియంపైకి దూసుకెళ్లడం, ప్లకార్డులను ఆయన ముఖంపై పెట్టడం, చేయి వేయటం వంటి విషయాలను సీఎంకు కూలంకషంగా వివరించారు నేతలు.
ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరిగే సమయంలో తెలుగు దేశం పార్టీ సభ్యుల ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 1పై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేస్తూ.. జీవో రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. పోడియం ముందులి చేరి నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికార వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో స్పీకర్ సీతారాం అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.
for