AP Group 1 Mains |ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ పరీక్షను… జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వాయిదా వేసింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ -1 మెయిన్స్ వాయిదా వేశామని ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు వెల్లడించారు. వాయిదా వేసిన ఈ పరీక్షల్ని జూన్ 3 నుంచి 9 వరకు నిర్వహిస్తామని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి రాష్ట్రం నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరు కానున్నారు.
Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే
Follow us on: Youtube, Instagram, Google News