టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay) కు మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో తండ్రి అయ్యన్నపాత్రుడికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై స్పందించిన అయ్యన్న.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా సోషల్ మీడియాలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో విజయ్ కి ఈ నోటీసులు ఇచ్చారు.
Read Also: నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్: రాహుల్గాంధీ