32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

AP Assembly: టీడీపీ సభ్యుల వైపు కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి: ఏపీ అసెంబ్లీ(AP Assembly)సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు. వైసీపీ(YCP) సభ్యుల వైపు కూర్చోకుండా.. టీడీపీ(TDP) ఎమ్మెల్యేల వైపు ఆనం కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఆనం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగంగానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీరియస్ అయిన ఆ పార్టీ అధిష్టానం వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి తరుణంలో ఆయన అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైపు కూర్చోవడం చర్చనీయాంశమైంది.

Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ

 కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల రవింద్ర కుమార్ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా, పోలీసులు ఇంకా అధికార పార్టీ నీడలోనే పని చేస్తున్నారన్నారు. పోలీసులను అస్త్రంగా మార్చుకొని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్