25.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

అమిత్ షా ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. రాత్రి 7గంటలకు రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో సమావేశంకానున్న షా.. రాత్రికి వైజాగ్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాలు సందర్శించిన అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. కాగా ప్రధానిమంత్రిగా మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో నిర్వహించనున్న మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్