స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అవినీతమయం అయ్యాయని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట ప్రభుత్వ సొమ్మ రూ. 371 కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. ఇప్పటినుండి అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదని.. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో మంచి వ్యవస్థలు ఏర్పడతాయని.. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వ్యాఖ్యానించారు.