ఆంధ్రప్రదేశ్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 27,982 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.2 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.