ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల వాడి దర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకోగా… 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Read Also: హైదరాబాద్ చేరుకున్న రామ్చరణ్.. అభిమానుల భారీ ర్యాలీ
Follow us on: Youtube Instagram