Site icon Swatantra Tv

సెక్యూరిటీ కోసమే బీజేపీతో పొత్తు: మంత్రి బొత్స

   ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు, లోకేశ్‌ భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. లోకేష్ కంటే తాను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశానని చెప్పారు. తనకెందుకు అంత సెక్యూరిటీ లేదని ప్రశ్నించారు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారని బొత్స విమర్శించారు.

Exit mobile version