Site icon Swatantra Tv

నాలుగు గంటల పాటు నరకయాతన.. రోడ్డుపైనే మహిళ ప్రసవం

స్వతంత్ర వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో పెంబి(Penbi) మండలం తులసీపేట వద్ద నడిరోడ్డుపైనే ఆదివాసీ మహిళ(Tribal women)  గంగామణి  ప్రసవించింది. గర్భిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. గర్భిణీని చేతులపైనే మోస్తూ కుటుంబీకులు వాగు దాటించారు.

వాగు దాటించి అంబులెన్స్ కోసం ఆమె కుటుంబీకులు ఫోన్ చేసినప్పటికి అంబులెన్స్‌లో డీజిల్ లేదని సిబ్బంది చెప్పారని గర్భిణీ బంధువులు ఆరోపణలు చేశారు. అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పైనే నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించిన అనంతరం గర్భిణీ మగ శిశువును  ప్రసవించింది.

Exit mobile version