Site icon Swatantra Tv

యువకుడిని కత్తితో పొడిచి, కూతురిని లాక్కెళ్లిన తండ్రి

    యువకుడుని కత్తితో పొడిచి, కూతురిని తండ్రి బలవంతంగా లాక్కెళ్ళిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. కందుల వంశీ, అత్తి శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి, కొందరు కులపెద్దలు కత్తులు, కర్రలతో దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన వంశీ, తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version