Site icon Swatantra Tv

శ్రీనగర్ శివారులో జీలం నదిలో బోటు బోల్తా

జమ్మూ కశ్మీర్ లో జీలం నదిలో ఓ బోటు బోల్తాపడిన ప్రమాదంలో పదిమంది గల్లంతయ్యారు NDRF బృందాలు గల్లంతయిన వారికోసం గాలిస్తున్నాయి. మరో పక్క సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతు న్నాయి. శ్రీనగర్ సమీపంలోని గండ్ బల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్ లో నదులు, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. నదిలో నీటిమట్టం పెరగడంతో బోటు బోల్తా పడింది. శ్రీనగర్ నగరంలోనూ రోడ్ల పక్కల తవ్విన గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి … జనం రోడ్లపై నడవడం కూడా కష్టమవుతోంది.

Exit mobile version