38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

ఎంపీ అవినాశ్ తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి నిమ్స్‌లో చికిత్స

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై జైలులో ఉంటున్న కడప ఎంపీ అవినాష్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి చికిత్స నిమిత్తం అధికారులు నిమ్స్‌ ఆస్పత్రి తీసుకువచ్చారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన శుక్రవారం అస్వస్థతకు గురవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో భాస్కర్‌ రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు. ఆయనకు గుండె సంబంధిత పరీక్షలు వైద్యులు నిర్వహించారు. ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలను సైతం చేపట్టారు. అనంతరం భాస్కర్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్ కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్