స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో తన కార్యాకలాపాలు ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన ఆ పార్టీ ఆఫీసును ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యకర్తలు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక విధానాలే లక్ష్యంగా రాష్ట్రంలో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తాను ఆంధ్రాలో చాటుతామని తోట వెల్లడించారు.