మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి.. భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. చివరకు బయట ప్రాంతాల వారి చేతుల్లోకి శ్రీకాకుళం భూములు వెళ్లి పోతాయని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని, అయాచీతంగా దోబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు హాట్ కామెంట్స్ చేశారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదని.. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
![](https://swatantralive.com/wp-content/uploads/2024/02/dharmana-prasada-rao-1024x576.webp)