స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీ పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.