స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని అబిడ్స్ ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. లైట్ హౌస్ షాప్ లో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలకు ఆర్పివేసే పనిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టంకానీ.. ఎవరికి గాయాలు అవడం కానీ జరుగలేదు. కాగా, మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.